ఉప్పల్ నుండి నారపల్లి వరకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి

ఉప్పల్ నుండి నరపల్లి వరకు ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయిన పరిస్థితి: ఉప్పల్ నుంచి నరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ ప్రధాన మార్గంలో ఫ్లైఓవర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వాహనదారులు చిన్న చిన్న గుంతలు,ఉండటంతో రహదారి పొడవునా తీవ్రంగా ట్రాఫిక్ జామ్‌అవుతుంది. మట్టి, ధూళితో నానా అవస్థలు పడుతున్నారు. దారిపొడవునా గుంతలు, అబద్దంగా మిగిలిన పనులు, ధూళి వలన పుట్టే ఆరోగ్య సమస్యలు – ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు బాధపడుతున్నారు ప్రజల వినతి:ప్రజలు అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం:ఎంత కాలంగా పనులు ఇలా నిలిచిపోయాయో. కనీసం ఇప్పుడు అయినా వేగంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే రోడ్డుపై నిత్యం ప్రయాణించడం ఓ శిక్షలా మారింది. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నా, ఇంకా అధికారుల నుంచి స్పష్టత లేదు. ఈ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్ధం కావడం లేదు. సిటీ అభివృద్ధికి ఫ్లైఓవర్‌లు అవసరమే. కానీ మధ్యలో ఆగిపోయిన పనులు – అభివృద్ధికి కాదు, ప్రజలకు భారంగా మారుతున్నాయి.

No comments:

Post a Comment

నేటి తెలుగు వార్తలు

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆపరేషన్ 'సింధూర్' ప్రారంభం

 2025 మే 7న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. భారత ప్రభుత్వం "ఆపరేషన్ సింధూర్" పేరిట పాకిస్తాన్ మరియు ...

Popular Content